Breaking News

ANJEER

యువరైతుకు సన్మానం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల తీర్మాలపూర్ కు చెందిన యువ రైతు శ్రీనివాస్​ అంజీర్​ పంటను సాగుచేసి లాభాలను పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవనశాఖ రైతుకు ప్రశంసాపత్రం అందజేసింది. బుధవారం రైతు శ్రీనివాస్​కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు పాల్గొన్నారు.

Read More