న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. 24 గంటల్లో దాదాపు 18,552 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం హెల్త్ బులెటెన్ రిలీజ్ చేసింది. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరింది. 24 గంటల్లో 384 మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య 15,985కు చేరింది. మన దేశంలో జనవరిలో మొదటి కేసు నమోదుకాగా, 149 రోజుల్లో ఐదులక్షల కేసులు […]
మాడ్రిడ్: కరోనా విజృంభణ ముందు టోర్నీలు వాయిదా పడుతూనే ఉన్నాయి. తాజాగా టెన్నిస్లో ప్రతిష్టాత్మకమైన డేవిస్ కప్, ఫెడ్ కప్ను వచ్చే ఏడాదికి వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్లో మాడ్రిడ్ వేదికగా డేవిస్ కప్ ఫైనల్స్ జరగాల్సి ఉన్నాయి. కానీ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో వచ్చే ఏడాది నవంబర్కు వాయిదా వేశారు. ఇప్పటికే అర్హత పొందిన 18 జట్లు ఇందులో బరిలోకి దిగుతాయి. మరోవైపు బుడాపెస్ట్లో నిర్వహించాల్సిన ఫెడ్ కప్ను ఏప్రిల్ 2021కు వాయిదా […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్లైన్ క్లాసులు వినాలంటే ల్యాప్టాప్, కంప్యూటర్, ట్యాబ్, లేదా స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. కొత్త వ్యక్తులకు అంటుకుంటోంది. శుక్రవారం 4,374 మందిని పరీక్షించగా 985 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకు మొత్తంగా 12,349 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా వ్యాధిబారిన పడి ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు 237 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 7,436 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు […]
సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనా వైరస్ నాకు రాదని, నేను ఆరోగ్యంగా బలంగా ఉన్నానని, పొరపాటున కూడా అనుకోవద్దని’ ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్బాషా ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. శుక్రవారం నగరంలోని రాజ్ విహార్, ఆర్ఎస్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు, ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్క్ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్దూరం పాటించాలని ఆదేశించారు. నగరంలో మాస్క్ […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి 11వేల మార్క్ దాటింది. శుక్రవారం ఒకే రోజు 605 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారి కేసు 34, ఇతరదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,489కు చేరింది. యాక్టివ్ కేసులు 6,147కు చేరాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారు 5,196 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య […]
సారథిన్యూస్, హైదరాబాద్: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా సోకింది. లాక్డౌన్ సడలింపులతో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్ షూటింగ్ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. […]
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక థియేటర్లు తెరిచే చాన్స్ లేకపోవడంతో యువదర్శకులంతా డిజిటల్ ఫ్లాట్ఫామ్ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి చేరిపోయారు. అల్లు అరవింద్ ప్రారంభించిన డిజిటల్ యాప్ ఆహా కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్సీరిస్ను తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తనటీనటులతో ఈ వెబ్సీరిస్ను ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. మరో పక్క అనీల్ ‘ఎఫ్3’ స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నాడు. కరోనా ప్రభావం […]