Breaking News

పోలీసు

గొలుసు దొంగల పట్ల ఓ కన్నేయండి

గొలుసు దొంగల పట్ల ఓ కన్నేయండి

సారథి న్యూస్, బిజినేపల్లి: ఇటీవల ఒంటరి మహిళలపై గుర్తుతెలియని దుండగులు బైక్​లపై వచ్చి గొలుసులు దొంగలించుకుంటున్నారని, వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ సూచించారు. మహిళలు రోడ్లపైకి వచ్చినప్పుడు అనుమానాస్పదంగా బైక్​లపై చుట్టూ తిరిగే వారిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అంతేకాకుండా గ్రామాలు, కాలనీల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలను అదుపుచేసే క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాని కోరారు.

Read More
పోలీసు కుటుంబాలకు చేయూత

పోలీసు కుటుంబాలకు చేయూత

సారథి న్యూస్​, కర్నూలు: విధి నిర్వహణలో కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురు పోలీస్​ కానిస్టేబుల్​ కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు ఆఫీసులో ఏవో సురేష్ బాబు కార్పస్ ఫండ్, విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి కార్పస్ ఫండ్ రూ.లక్ష, విడో ఫండ్ రూ.50వేలు, ఫ్లాగ్ ఫండ్ రూ.25వేల విలువైన చెక్కులను అందజేశారు. ఎంసీ మద్దిలేటి(నందవరం పీఎస్​), ఎంపీ పుల్లారెడ్డి(నంద్యాల 3 టౌన్ పీఎస్), ఎస్ఏ మాలిక్(కర్నూలు […]

Read More
శభాష్​పోలీస్​

శభాష్​ పోలీస్​

అనారోగ్యంతో వ్యక్తి మృతి కరోనా అనుమానంతో ముందుకురాని బంధువులు, కుటుంబసభ్యులు ఆటోలో డెడ్​బాడీని తీసుకెళ్లిన ఎస్సై మారుతి శంకర్‌ అంత్యక్రియలు జరిపి ఆదర్శంగా నిలిచిన పోలీసు అధికారి సారథి న్యూస్, కర్నూలు, ప్యాపిలి: బంధాలు.. బంధుత్వాలు మరిచిన సమాజంలో మానవత్వం పరిమళించింది. మనుషులకు, మానవత్వానికి ఖాకీలు విలువ ఇవ్వరని భావించే వారంతా సోమవారం ఓ ఎస్సై చేసిన మంచి పనికి ఫిదా అయిపోయారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందితే బంధువు, కుటుంబసభ్యులు […]

Read More
తప్పతాగి కారు డ్రైవింగ్

తప్పతాగి కారు డ్రైవింగ్

న్యూఢిల్లీ: ఫుల్లుగా మద్యం తాగి కారు నడిపిన ఓ పోలీసు వేగం అదుపు తప్పి మహిళను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీస్‌ ఆఫీసర్‌‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని చిల్లా గ్రామం సమీపంలో ఒక పోలీస్‌ ఆఫీసర్‌‌ రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దాన్ని గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు దగ్గరికి వచ్చేలోపే కారును మళ్లీ ఆమెపై నుంచి పోనిచ్చాడు. దీంతో […]

Read More
కరోనా కట్టడిలో కృషి భేష్​

కరోనా కట్టడిలో కృషి భేష్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనా కట్టడిలో పోలీసుల కృషి మరువలేనిదని ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి అన్నారు. మంగళవారం స్థానిక మినీ కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన 24 మంది పోలీసు కానిస్టేబుళ్లు, సిబ్బందిని పూలమాలలతో కుటుంబసభ్యులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసుశాఖలో ఒత్తిడిని ఎదుర్కొని ప్రజలకు మంచి సేవలు అందిస్తూ, కుటుంబాలకు న్యాయం చేస్తూ విధులు నిర్వహించారన్నారు. పోలీసు కుటుంబాల సహాయ సహకారాలు మరువలేనివన్నారు. రిటైర్డ్ మెంట్ ​తర్వాత ఏవైనా సమస్యలు […]

Read More