సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన చెందిన ఇద్దరు చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న పోరుకు తమవంతు సాయం అందించారు. తాము దాచుకున్న పాకెట్ మనీ రూ.2,009ను ‘సీఎం కేర్స్ ఫండ్’కు విరాళంగా ఇచ్చి తమలోని దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి కులకర్ణి పిల్లలు దేశ్ పాండే బాలార్క్ ఐదవ తరగతి, దేశ్పాండే శ్రీహార్ష్ స్థానిక ఓ ప్రైవేట్ స్కూలులో రెండవ తరగతి చదువుతున్నాడు. […]