సామాజికసారథి, వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి(చల్లపల్లి)లో మాదిగ ఐక్యవేదిక కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా సమావేశానికి మాదిగ ఐక్యవేదిక నాయకులు కొయ్యల పుల్లయ్య, గుద్దటి కిస్టాల్, కొమ్ము అంజయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మీసాల అంజయ్య మాట్లాడుతూ.. మాదిగలు రాజకీయాలకు అతీతంగా ఏకమై తమ చైతన్యాన్ని చాటుకోవాలని కోరారు. ఎవరికైనా ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలకు ప్రతిఘటన సింగరేణి నుంచే మొదలు కావాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎంఏ గౌస్, జి.రాములు, బేగ్ పిలుపునిచ్చారు. సోమవారం రామగుండం ఆర్ జీ1 ఏరియాలోని జీడీకే1 గని గేట్ మీటింగ్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలన్నారు. 50 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి సిద్ధం చేసిందన్నారు. ఈనెల 10, 11న సింగరేణివ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు, […]
సారథి న్యూస్, గోదావరిఖని: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 10, 11 తేదీల్లో బొగ్గు గనుల వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని గాంధీనగర్లోని ఐఎఫ్ టీయూ ఆఫీసులో విప్లవ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.