Breaking News

చిన్నశంకరంపేట

ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, […]

Read More
ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

సారథి, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి, మల్లుపల్లి, రుద్రారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం డీఆర్డీఏ ఐకేపీ ద్వారా 110 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నేటికీ 14,600 మంది రైతుల నుంచి రూ.123 కోట్ల విలువైన 6.64 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 12,600 మంది రైతుల ఖాతాల్లో […]

Read More
హరితహారానికి మొక్కలు రెడీ

హరితహారానికి మొక్కలు సిద్ధం

సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]

Read More
ఆత్మీయత పంచిన వేడుక

ఆత్మీయత పంచిన వేడుక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉన్నత పాఠశాల 2008-09 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం చిన్నశంకరంపేట శ్రీనివాస గార్డెన్​ లో ఉపాధ్యాయులతో కలిసి వారి మధురానుభూతులను పంచుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఒకరికి ఒకరు ఒకే చోట కలవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, జాన్​ వెస్లీ, బాలేశం, నర్సింగరావు, […]

Read More
ఘనంగా మొల్లమాంబ జయంతి

ఘనంగా మొల్లమాంబ జయంతి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: తొలి తెలుగు మహిళ కవియిత్రి కుమ్మర్ల ఆడపడుచు మొల్లమాంబ (579)జయంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భావితరాలకు తెలిసేలా ప్రభుత్వమే జయంతి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుమ్మరి నాగరాజు, కుమ్మరి స్వామి, కుమ్మరి భిక్షపతి, కుమ్మరి శ్యాములు కుమ్మరి రాజు, కుమ్మరి సత్యనారాయణ, కుమ్మరి సంతోష్, కుమ్మరి లచ్చయ్య, కుమ్మరి కృష్ణయ్య, కుమ్మరి నర్సింలు పాల్గొన్నారు.

Read More
దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడవ వార్షికోత్సవాలను రెండు రోజులు నిర్వహించనున్నట్లు సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో మొదటిరోజు చండీహోమం, కుంకుమార్చన, పుష్పార్చన తో పాటు శనివారం అన్నదానం, పూజ బోనాలు నిర్వహిస్తారు. మండల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కోరారు.

Read More
టీఆర్ఎస్​సభ్యత్వ నమోదు

టీఆర్ఎస్​ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ ​జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్​లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్​ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, […]

Read More
రుణాలను సకాలంలో చెల్లించాలి

రుణాలను సకాలంలో చెల్లించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం […]

Read More