Breaking News

Month: May 2021

ఫీవర్ సర్వే పక్కాగా ఉండాలి

ఫీవర్ సర్వే పక్కాగా ఉండాలి

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ వో) డాక్టర్ కె.సుధాకర్ లాల్ సోమవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజినేపల్లి పీఎచ్ సీ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్యపరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా నమోదుచేసుకుని, వారికి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని సూచించారు. కరోనా […]

Read More
పేదలకు అండగా ఎంజేఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎంజేఆర్ ట్రస్ట్

సారథి, బిజినేపల్లి: కరోనా బాధితులు, వారి కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అండగా నిలిచారు. సోమవారం ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కరోనా బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తిమ్మాజీపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి, బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో సరుకులు అందజేశారు. సంబంధిత కుటుంబాల్లో ఎమ్మె్ల్యే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో […]

Read More
స్వరం వాడకం తగ్గించాలి

భాస్వరం వాడకం తగ్గించాలి

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో భాస్వరం కరగదీసే బ్యాక్టీరియాపై మండల వ్యవసాయాధికారి సతీష్ అవగాహన నిర్వహించారు. రైతులు వేసిన భాస్వరం ఎరువు 40శాతం మాత్రమే మొక్కలు తీసుకుని మిగతా 60శాతం భూమిలో బంధించి ఉంటుందన్నారు. ఈ భాస్వరాన్ని ఈ బ్యాక్టీరియా ద్వారా అందుబాటులోనికి తీసుకురావచ్చన్నారు. అదేవిధంగా రైతులు భాస్వరం వాడకం తగ్గించాలని సూచించారు. పీఎస్ బీ స్టా్క్ రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో […]

Read More
పండ్ల ధరలకు రెక్కలు

పండ్ల ధరలకు రెక్కలు

కరోనా ప్రభావమే కారణం అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి […]

Read More
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల […]

Read More
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

సారథి, జగిత్యాల రూరల్: లాక్ డౌన్ నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనిఉంటే 10 గంటలలోపే పూర్తిచేసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Read More
రిపోర్టర్లకు సరుకులు పంపిణీ

రిపోర్టర్లకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కన్వీనర్, గోపాల్ రావు పేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న శుక్రవారం పాత్రికేయులకు సరుకులు, బియ్యం, పప్పు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా అనునిత్యం వార్త సేకరణ చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు గంటే భాస్కర్, ఎజ్రా మల్లేశం, రామస్వామి, రజాక్, రమేష్, బొడిగే శ్రీను, మహేష్ పాల్గొన్నారు.

Read More
తునికాకు కల్లాల పరిశీలన

తునికాకు కల్లాల పరిశీలన

సారథి, తాడ్వాయి: వన్యప్రాణి విభాగం పరిధిలోని నర్సింగాపూర్ బీట్ తునికాకు కల్లాలను ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ధేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. ఆకుల కట్టలను గన్నీ బ్యాగుల్లో సక్రమంగా నింపాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ డీ వో గోపాల్ రావు, తాడ్వాయి ఎఫ్ ఆర్వో షౌకత్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ కుమార్ స్వామి, బీట్ […]

Read More