సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి బ్రేక్ పడింది. ఈ ఏడాది దసరా రోజున జరగాల్సిన బన్నీ ఉత్సవంపై నిషేధం విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవంపై నిషేధం విధించినట్లు పోలీసులు ప్రకటించారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దసరా వచ్చిందంటే ఎక్కడైనా దుర్గమ్మ పూజలు చేస్తారు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో ఫైట్ చేస్తుంటారు. సంప్రదాయం పేరిట తలలు పగలగొట్టుకుంటారు. చేతులు విరగ్గొట్టుకుంటారు. కర్రల యుద్ధంలో ఎంతో మంది […]
సారథి న్యూస్, వనపర్తి: మట్టిఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదఘటన జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన సంవత్సరీకం కోసం కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసింది. ఉక్కపోతకు ఫ్యాన్ ఉందని 11మంది ఒకే గదిలో నిద్రపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా నానిపోయి […]
సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో […]