సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయమంతా సీఎం కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. కరోనా కాలంలో సీఎం కనిపించడం లేదంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విపక్ష కార్యకర్తలు, నేతలు సీఎం కనిపించడం లేదంటూ పోలీస్స్టేషన్లలో కేసులు కూడా పెట్టారు. కేసీఆర్.. తెలంగాణలో రాజకీయం ఏదైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. ఏం చేస్తాడనేది కూడా ఆసక్తిగా […]
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్డౌన్ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన 25 […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే […]
సారథి న్యూస్, హైదరాబాద్: 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 21కోట్ల మంది కరోనాబారిన పడతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2020 ఆగస్టు 15కు కరోనా వ్యాక్సిన్ తెస్తామంటోంది భారత ప్రభుత్వం. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించేందుకు అవకాశాలను కొట్టిపారేయలేమంటుంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సర్కారు రోజురోజుకూ వైద్యపరీక్షలు పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని పరీక్షించింది. మరి.. తెలంగాణలో 28వేల మందికి వైరస్ సోకింది. 16వేల మంది డిశ్చార్జ్అయ్యారు. 12వేల మంది ఆస్పత్రుల్లో […]
సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర నది పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక గెస్ట్హౌస్లో పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలపై నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయని, అప్పటిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, రోడ్లు, […]
విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ గ్రామీణ యాసకు తనదైన మార్కుని జోడించి వార్తలు చెప్పే బిత్తిరి సత్తి ‘సాక్షి’లో చేరారు. మొదట వీ6 చానెల్‘తీన్మార్ ప్రోగ్రాం’ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సావిత్రి అలియాస్ జ్యోతి, చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి హంగామా అంతాఇంతా కాదు. తాను పనిచేసిన చానల్ లో అభిప్రాయభేదాలు రావడం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి సత్తి అక్కడ రాజీనామా టీవీ9లో చేరిన విషయం తెలిసిందే. సత్తి బిగ్బాస్లో హౌస్లోకి […]
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 6.875 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 2,30,599 కి చేరింది. తాజాగా 219 మందిని కరోనా పొట్టనపెట్టకోగా.. మొత్తం మరణాల సంఖ్య 9,667కు చేరింది. కాగా 1,27, 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వెల్లడించారు.
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు […]