డ్యామ్లో 815 అడుగుల నీటిమట్టం జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి […]
సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన 100 పడకల ప్రత్యేక కోవిడ్ వార్డు, ఐసోలేషన్ బ్లాక్ను మంత్రి హరీశ్రావు బుధశారం ప్రారంభించారు. డాక్టర్లు, వైద్యసిబ్బందితో ఆయన మాట్లాడారు. చిరునవ్వుతో వైద్యం అందిస్తే రోగం నయమవుతుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, స్టాఫ్నర్సుల సంఖ్యను పెంచుతామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్వెంకట్రామరెడ్డి, జిల్లా వైద్యాధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ పరిస్థితుల్లో నైపుణ్యమే కీలకం వర్చువల్ మీటింగ్లో మాట్లాడిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనకు సరికొత్త చాలెంజ్లను విసిరిందని, దాన్ని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ యూత్ స్కిల్ డేను పురస్కరించుకుని యువతను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. నైపుణ్యం అనేది చాలా కీలకమైందని, ఇలాంటి సమయంలోనే యువత తమ స్కిల్స్కు పదును పెట్టాలని మోడీ చెప్పారు. ‘మీ స్కిల్స్ను నిరూపించుకునేందుకు ఈ రోజును అంకితమిచ్చారు. కొత్త కొత్త […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్కషన్(గ్రేడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం సమావేశమయ్యారు. ఐటీ అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెట్రోరైలు, శిల్పారామం, మూసీనది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక వసతులు పెరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే నగరం ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల […]
ప్రసిద్ధ మ్యాథమెటీషీయన్ శంకులాదేవి జీవిత చరిత్ర ను ‘శకుంతా దేవి’ పేరుతోనే బాలీవుడ్లో అనూమీనన్ తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసింది టీమ్. 1980లో హ్యూమన్ కాలిక్యులేటర్ గా బంగారు అక్షరాలతో గిన్నిస్ బుక్ కు ఎక్కిన ఘనత శకుంతలా దేవిది. ఈ చిత్రంలో 1970లో రెట్రో గెటప్ తో శకుంతలా దేవిగా దర్శనమిచ్చింది విద్య. ఉన్నత శిఖరాలను […]
జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీ ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. రెండు గంటలపాటు కొనసాగిన మీటింగ్లో పలు కీలకమైన అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చించింది. అందుకోసం జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]
సారథి న్యూస్, హైదరాబాద్: వేగంగా విజృంభిస్తున్న మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీగా కరోనా టెస్టులు, వైద్యం అందించాలని నిర్ణయించింది. అందుకోసం మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపికచేసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిసింది. అయితే ఎంపికచేసిన వాటిలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమత మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొదట కరోనా టెస్టులు, కరోనా వైద్యచికిత్సలు ఫ్రీగా అందజేస్తారు. […]
న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ వచ్చి ముంబైలోని నానావతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ హెల్త్ వర్కర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ‘సహజమైన తెల్లని దుస్తులు వేసుకుని, వారు సేవ చేసేందుకు అంకితం, వారు దేవుడి అవతారంలో ఉన్నారు. అహాన్ని చెరిపేసి మన సంరక్షణ స్వీకరించారు. వారు మానవత్వం జెండాను ఎగరేస్తున్నారు’ అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్బచ్చన్, అభిషేక్ బచ్చన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ […]