న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. డెడ్బాడీస్కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 […]
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 33 గంటల పాటు లాక్డౌన్ విధించారు. శనివారం నుంచి సోమవారం సాయంత్ర 5గంటల వరకు లాక్డౌన్ విధించినట్లు పోలీసులు చెప్పారు. బెంగళూరులో ప్రతి ఆదివారం లాక్డౌన్ ప్రారంభం కాగా.. ఈ సారి శనివారం నుంచి సోమవారం వరకు విధించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘లాక్డౌన్ 8గంటలకు స్టార్ట్ అవుతుంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముగుస్తుంది. రెస్పెక్టెడ్ సిటిజన్స్ […]
ముంబై: కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కంపెనీలు, ప్రొడక్షన్ యూనిట్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో వర్కర్లు కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్రన్ మహారాష్ట్ర బజాజ్ యూనిట్లో 250 మంది ఎంప్లాయిస్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్ని క్లోజ్ చేయాలని బజాజ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా అసలే ప్రొడక్షన్ లేదని, ఇప్పుడు స్టార్ట్ అయినా కూడా కంటిన్యూ చేసే పొజిషన్ కనిపించడం లేదని వర్కర్లు […]
తిరువనంతపురం: కరోనాను కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్ మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడడం, సోషల్ డిస్టెంసింగ్ ఏడాది పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు […]
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో 8 మంది పోలీసులపై కాల్పులు జరిపిన కేసుకు సంబంధించి పోలీసులు వికాస్ దుబే అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసి విచారించారు. అతడిని విచారించిన పోలీసులకు కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని చౌబేపూర్ పోలీస్స్టేషన్ నుంచి ఒక పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అతను చెప్పాడు. దీంతో అప్రమత్తమైన దుబే తన అనుచరుల్లో దాదాపు 25మందికి సమాచారమిచ్చి కాల్పులకు పాల్పడేలా చేశారని అన్నారు. ఘటన జరిగిన […]
జెనీవా: కరోనా పేషంట్ల ట్రీట్మెంట్కు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోర్వోకిన్ ట్యాబ్లెట్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రయల్స్ను నిలిపేసింది. ఆ డ్రగ్ కరోనాను పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్వో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్తో పాటు లోపినవిర్, రిటోనవిర్ డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్ను కూడా ఆపివేసినట్లు సంస్థల వెల్లడించింది. ఈ డ్రగ్స్ మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది.
కోల్కతా: ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ కాలనాగు. ఆమె ఆర్థికవ్యవస్థను నాశనం చేశారు’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే […]