ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే ఓ బ్యానర్ను స్థాపించి వెబ్సీరిస్ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్సిరీస్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]
ఇప్పటికే ‘పవర్స్టార్’ అనే సినిమా తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. తర్వాత మరో అగ్రనటుడు బాలకృష్ణను టార్గెట్ చేయబోతున్నట్టు సమాచారం. 16 ఏండ్ల క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో బెల్లంకొండ సురేశ్ గాయపడ్డాడు. తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసు మరుగున పడింది. ఆ రాత్రి బాలయ్యబాబు ఇంట్లో ఏం జరిగిందో అన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఉండిపోయింది. అయితే కాలక్రమేణా ఆ ఘటనను అందరు మరిచిపోయారు. కానీ […]
బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్నంబర్లు, అడ్రస్ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. వాళ్లందరికీ కరోనా పాజిటివ్ […]