Breaking News

సంస్థాగతంగా బలపడదాం

సారథి న్యూస్​, రామగుండం: టీఆర్​ఎస్​ పార్టీని రామగుండం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పిలుపునిచ్చారు. గురువారం ఆయన రామగుండం నియోజవర్గం టీఆర్​ఎస్​ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు, పట్టణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.