![ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ktr_tele-2.jpg?fit=677%2C441&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇన్చార్జ్లతో టీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కె.తారక రామారావు శనివారం టెలీకాన్ఫరెన్స్నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఓర్వలేనితనంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాల చిల్లర ప్రయత్నాలను ఎండగట్టాలని సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో పార్టీగా ముందుకు పోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులంతా తొలిరోజే తమ ఓట్లను, కుటుంబసభ్యుల ఓటర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. తాను కూడా 1వ తేదీన ఓటరుగా నమోదు చేయించుకుంటానని చెప్పారు.