Breaking News

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​.

అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ చేసింది నిజమేనని.. కానీ తాను డ్రగ్స్​ మాత్రం తీసుకోలేదని.. డ్రగ్స్​ మాఫియాతో తనకు ఏ విధమైన సంబంధం లేదని రకుల్​ చెప్పిందట. కాగా మరోరోజు రకుల్​ ప్రీత్​సింగ్​ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నది. అయితే రకుల్​ ముంబై వెళ్లిన ప్రతిసారి రియా చక్రవర్తితో క్లోజ్​గా ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఎన్నోసార్లు పార్టీలకు హాజరయ్యారు. దీంతో రకుల్​పై అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే రకుల్ ప్రీత్​సింగ్​కు నిజంగానే డ్రగ్స్​కేసుతో ఏ సంబంధం లేదా.. ఆమె బాధితురాలా? లేక నిందితురాలా అన్న విషయం త్వరలో తేలనున్నది.