Breaking News

తెలంగాణలో 2,534 కరోనా కేసులు

తెలంగాణలో 2,534 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్​25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ ​23, భద్రాద్రి కొత్తగూడెం 81, జగిత్యాల 65, జనగామ 41, జయశంకర్​ భూపాలపల్లి 24, జోగుళాంబ గద్వాల 29, కామారెడ్డి 123, కరీంనగర్​107, ఖమ్మం 109, కొమరంభీం ఆసిఫాబాద్ ​30, మహబూబ్​నగర్ ​38, మహబూబాబాద్ ​73, మంచిర్యాల 64, మెదక్​ 42, మేడ్చల్​ మల్కాజిగిరి 132, నాగర్​కర్నూల్ ​62, నల్లగొండ 149, నిర్మల్​ 25, నిజామాబాద్ 90, పెద్దపల్లి 58, రాజన్న సిరిసిల్ల 47, రంగారెడ్డి 195, సంగారెడ్డి 96, సిద్దిపేట 103, సూర్యాపేట 83, వికారాబాద్ 22, వనపర్తి 42, వరంగల్​ రూల్​41, వరంగల్​అర్బన్ ​124, యాదాద్రి భువనగిరి 57 చొప్పున పాజిటివ్ ​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులెటిన్​ను విడుదల చేసింది.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్