Breaking News

ట్రాఫిక్ రద్దీ లేని సిటీగా హైదరాబాద్​

ట్రాఫిక్ రద్దీ లేని సిటీగా హైదరాబాద్​

సారథి న్యూస్, హైదరాబాద్: మంత్రి కేటీఆర్​ఆదేశాల ప్రకారం హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దేందుకు రోడ్ల విస్తరణ, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి రెండు వైపులా చేపట్టిన రోడ్ల విస్తరణలో కోల్పోతున్న ఆస్తులు, హోర్డింగ్స్, యూనిపోల్స్ ను తొలగించేందుకు సంబంధిత యజమానులు, చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి, ఏసీపీలతో మేయర్ బుధవారం జీహెచ్ఎంసీ ఆఫీసులో చర్చించారు.

రాకపోకలను మరింత సులభం చేసేందుకు మల్కంచెరువు, మల్కాపూర్, జూబ్లీహిల్స్, జవహర్ నగర్, మాదాపూర్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో హెచ్ఆర్డీసీ కింద మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణానికి సేకరించాల్సిన స్థలాల యజమానులతో చర్చించారు. సమావేశంలో కార్పొరేటర్ కె సాయిబాబా పాల్గొన్నారు.