Breaking News

జగన్​ ఇలాఖాలో సభపెడతా!

ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్​ కాంగ్రెస్​ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్​ కాంగ్రెస్​ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి లేదంటూ ఫైర్​ అయ్యారు. ‘కరోనా తగ్గాక నేను పులివెందులకు వెళ్తా.. అక్కడ 10 వేల మందితో సభపెడతా.. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడతా ఎవరు అడ్డొస్తారో చూస్తా’ అంటూ ఓ రేంజ్​లో ఫైర్​ అయ్యారు రఘురామకృష్ణం రాజు.