![రికార్డు స్థాయిలో కరోనా కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/hyd-23.jpg?fit=2121%2C1414&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ రూరల్ జిల్లాలో 10 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.