Breaking News

ప్రతిగ్రామంలో 50 కల్లాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఆయన డివిజన్​ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్​కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్​, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన హుస్నాబాద్ ఎంపీడీవో సత్యనారాయణను కలెక్టర్​ సస్పెండ్​ చేశారు.