Breaking News

తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 2,384 పాజిటివ్‌ కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం(గత 24 గంటల్లో) కొత్తగా 2,384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 755 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1,04,249కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 80,586 మంది కోలుకోగా.. 22,908 మందికి చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్కరోజే 40,666 కరోనా నిర్ధారణ వైద్యపరీక్షలు చేశారు. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 472, నిజామాబాద్‌‌ జిల్లాలో 148 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.