Breaking News

తెలంగాణలో 2,137 కరోనా కేసులు

తెలంగాణలో 2,137 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,137 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. 2,192 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,39,700కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా వ్యాధి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,033కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే 53,811 శాంపిళ్లను టెస్ట్​చేశారు.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 51, జీహెచ్​ఎంసీ 322, జగిత్యాల 42, జనగామ 34, జోగుళాంబ గద్వాల 27, కామారెడ్డి 60, కరీంనగర్ ​132, ఖమ్మం 90, మహబూబ్​నగర్​ 28, మహబూబాబాద్​72, మంచిర్యాల 38, మెదక్ 28, మేడ్చల్​ మల్కాజిగిరి 146, నాగర్​కర్నూల్ 37, నల్లగొండ 124, నిర్మల్​ 24, నిజామాబాద్​72, పెద్దపల్లి 48, రాజన్న సిరిసిల్ల 57, రంగారెడ్డి 182, సంగారెడ్డి 65, సిద్దిపేట 109, సూర్యాపేట 61, వికారాబాద్ ​29, వనపర్తి 29, వరంగల్ ​రూరల్ ​24, వరంగల్​ అర్బన్​ 90, యాదాద్రి భువనగిరి 35 చొప్పున పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.