Breaking News

తెలంగాణలో 1,590 కేసులు

తెలంగాణలో 1,590 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం రాష్ట్రంలో 1,590 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,902కు చేరింది. ఇప్పటి వరకు 1,15,835 మందిని పరీక్షించారు. తాజాగా ఏడుగురు మృతిచెందారు. ఇప్పటి వరకు 295 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 1277, మేడ్చల్​ జిల్లాలో 125, రంగారెడ్డి జిల్లాలో 82, సంగారెడ్డి జిల్లాలో 19, మహబూబ్​ నగర్​ జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 14 కేసుల చొప్పున కేసులు పాజిటివ్​గా తేలాయి.