సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 77,513 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి 14 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 615కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 22,568 వరకు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్26, భద్రాద్రికొత్తగూడెం 79, జగిత్యాల 49, భూపాలపల్లి 38, జోగుళాంబ గద్వాల 95, కామారెడ్డి 76, కరీంనగర్101, ఖమ్మం 69, మహబూబ్నగర్ 45, మహబూబాబాద్ 23, మంచిర్యాల 44, నల్లగొండ 61, నిజామాబాద్ 74, పెద్దపల్లి 84, రంగారెడ్డి 181, వరంగల్ అర్బన్ జిల్లా 187, యాదాద్రి భువనగిరి 24 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్ను విడుదల చేసింది.
- August 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- COVID19
- HYDERABAD
- POSITIVE
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- పాజిటివ్ నిర్ధారణ
- హైదరాబాద్
- Comments Off on ఒకేరోజు 2,256 కరోనా కేసులు