సామాజిక సారథి, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా మొదటి వేవ్ లో కూడా ముత్తిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సతీమణి, గన్ మెన్, వంటమనిషి, డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచించారు.