సారథి న్యూస్, కర్నూలు: నగరంలో ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టవద్దని రెండవ రోజు బుధవారం పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలు జొహరాపురం, చిత్తారి వీధి, కొత్తపేట, రోజా వీధి ఏరియాల్లో 25 ఏళ్లుగా ఇసుక బండ్ల ద్వారా దళిత బడుగు బలహీనవర్గాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఉపాధికి గండి […]