సారథి న్యూస్, హైదరాబాద్: సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]
సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని అందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం మెదక్ నియోజకవర్గంలోని పాపన్నపేట మండలం, మెదక్ పట్టణంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం యూసుఫ్ పేటలో డబుల్ బెడ్రూమ్ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్అర్బన్37, కరీంనగర్58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. లాక్డౌన్ ఎత్తివేయడంతోనే కరోనా విజృంభించిందని పేర్కొన్నారు. లాక్డౌన్ను పటిష్ఠంగా అమలుచేసి ఉపాధి కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: వారంతా ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు.. ఆ వృత్తిలో వారంతా నిష్ణాతులు. రోగులు, చికిత్సలు, శస్త్రచికిత్సలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైద్యులు. కరోనా కష్టకాలంలోనూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు ఆయువు పోస్తున్న సేవాతత్పరులు. కోవిడ్-19 రాష్ట్రంలో వ్యాపించినప్పటి నుంచి వంతుల వారీగా డ్యూటీలు చేస్తూ.. వైరస్ విజృంభణతో కుటుంబాలకు దూరంగా గడుపుతూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న కార్యదీక్షులు. ఈ క్రమంలో కరోనాకు చికిత్సలు అందించే డాక్టర్లు అత్యంత […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తంగా 42,496 కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 27,296 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 403 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 13,389 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 806, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్82, సంగారెడ్డి 18, […]
కరోనాకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచి ట్రీట్మెంట్ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు కరోనా కోసమే రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లు పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టుల భర్తీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాకు ప్రజలు భయాందోళనకు గురికావదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కరోనా వైరస్ సోకినవారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స […]
ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు డ్రాప్ అవుట్స్ తగ్గించడం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నారని వివరించారు. […]