సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.
సారథి న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి www.bse.telangana.gov.in వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.