సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలోకి ప్రవేశాలకు అడ్మిషన్లు నిర్వహించేందుకు గాను పరీక్ష తేదీని ప్రభుత్వం ఖరారుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్ ను వాయిదావేసింది. పరిస్థితులు కుదుటపడుతుండడంతో నవంబర్1న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్15వ తేదీ వరకు గురుకుల వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో 48,240 సీట్ల కోసం 1,48,168 అప్లికేషన్లు వచ్చాయని […]
సారథి న్యూస్, కర్నూలు: కనిపించని వైరస్తో ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయని, నిర్లక్ష్యంతోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని ఆమె పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మాస్కులు, మూడొందల శానిటైజర్లు పంపిణీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే ఉపాధి పనులను […]