సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్వైజర్గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్మెన్గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్ సీడ్ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్కు […]
సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక భారీ ప్రాజెక్టు సింగూరు రెండేళ్ల తర్వాత జలకళ సంతరించుకుంది. 29 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు వర్షాభావ పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా వెలవెలబోయింది. 2018లో ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు 16 టీఎంసీల నీటిని తరలించింది. దీంతో సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింగూరులో నీళ్లు లేక కాల్వల కింద […]
సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.నిజాం నవాబుల కాలంలో […]