సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్తో మాట్లాడి హెలిక్యాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని […]