Breaking News

SANTHOSH BABU

22న సంతోష్​బాబు ఇంటికి సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: గాల్వన్​ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో మృతిచెందిన కల్నల్​ సంతోష్​ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈనెల 22న సీఎం కేసీఆర్​ సూర్యాపేటకు రానున్నారని మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు. శనివారం కల్నల్​ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. భవిష్యత్​లో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదుకోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అలాగే సంతోష్​బాబు సతీమణికి గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు.

Read More

సంతోష్ బాబుకు సండ్ర నివాళి

సారథి న్యూస్​, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం చెందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం సత్తుపల్లిలో కొవ్వొత్తిని వెలిగించి నివాళులు అర్పించారు. వీర మరణం చెందిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.

Read More

కేసారంలోనే సంతోష్​ బాబు అంత్యక్రియలు

సారథి న్యూస్​, సూర్యాపేట: భారత్‌ సరిహద్దుల్లో చైనా దొంగ దెబ్బకు అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరింది. వీరజవాన్​ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు […]

Read More

హకీంపేటకు కల్నల్ సంతోష్‌ పార్థివదేహం

సారథి న్యూస్​, హైదరాబాద్‌: భారత్ -చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు పార్థివదేహం బుధవారం హకీంపేట విమానాశ్రయానికి చేరింది. కల్నల్‌ సంతోష్‌ పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసైతో పాటు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం సూర్యాపేటలోని కేసారంలో కల్నల్‌ సంతోష్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనాన్ని సిద్ధంచేశారు.

Read More

హైదరాబాద్​కు చేరిన కల్నల్​ కుటుంబసభ్యులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్​ కల్నల్​ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్​పోర్టు​కు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్​ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్​ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్​ సంతోష్​బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో […]

Read More