సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మాజీ హోంమంత్రి, ప్రముఖ కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. నిమోనియా బారినపడ్డాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నాయినికి భార్య అహల్య, కొడుకు దేవేందర్రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని అల్లుడు వి.శ్రీనివాస్రెడ్డి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్. సోషలిస్టుగా జీవితం ప్రారంభించిన నాయిని సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం ఆయన […]