సారథి, ములుగు: ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ఆలిండియా మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క ఎన్ టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ పంచాంగం బుక్ ఆవిష్కరించారు. భక్తిటీవీ మున్ముందు మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ అరుణ్ కుమార్, ములుగు రిపోర్టర్ సంపత్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లాల కుమారస్వామి. కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు బానోత్ చందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్ మేనక సూచించారు.
సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు […]
సారథి, ములుగు: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్నిబంధన ఉత్తర్వులను వివరించారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ శానిటైజర్ ఉపయోగించాలని కలెక్టర్సూచించారు.
సారథి, ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని, కావునా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను తగ్గించుకోవాలని, పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు […]
సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]
సారథి, ములుగు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందిపడకూడదని ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్వోఎఫ్ఆర్ లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ములుగు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. […]
సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో […]