సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈద్గాలు, మసీద్ ల్లో ప్రత్యేక నమాజు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జామామసీద్ తోపాటు అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేశారు. శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. నాగర్ కర్నూల్ ఈద్గా వద్ద ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నిరూపించారని నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]