సారథిన్యూస్, రామడుగు: తమను ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్, కాలేజ్లో పనిచేస్తున్న అవర్లీ బేస్డ్ టీచర్లు (హెచ్బీటీ) శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతిపత్రం సమర్పించారు. లాక్డౌన్ కాలం నుంచి జీతాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సంఘం నాయకులు ప్రశాంత్, శ్రీనివాస్, పూర్ణచందర్, గణపతి, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, పెద్దపల్లి: ఎరువుల కర్మాగారం నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని ఆయన సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు […]