Breaking News

JANGAROY

దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడో వార్షికోత్సవం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామంలో దుర్గామాత పాపమ్మ ఆలయ ఏడవ వార్షికోత్సవాలను రెండు రోజులు నిర్వహించనున్నట్లు సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో మొదటిరోజు చండీహోమం, కుంకుమార్చన, పుష్పార్చన తో పాటు శనివారం అన్నదానం, పూజ బోనాలు నిర్వహిస్తారు. మండల ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు కోరారు.

Read More
తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

తహసీ​ల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్​లో కొంత భూమిని అసైన్​మెంట్​గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్​ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను […]

Read More