సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఎనిమిది మందికి రూ. లక్ష 98 వేల విలువైన సీఎం సహాయకనిధి చెక్కులను శనివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
సారథి న్యూస్, గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామంలో నిర్మించనున్న పద్మశాలి సంఘ భవనం, మహిళా సంఘం, ఎస్సీ కమ్యూనిటీహాల్ పనులకు బుధవారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.