సారథి న్యూస్, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై ఓ సీఐ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు శుక్రవారం కలెక్టర్ జి.వీరపాండియన్కు ఫిర్యాదు చేసింది. ఈనెల 15న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న సదరు మహిళ.. కేసు విచారణలో ఉండగానే సీఐ బెదిరింపుకు ప్పాడుతున్నాడని ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని, సీఐ నుంచి రక్షణ కల్పించాలని కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమినషరేట్లోని మట్వాడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన కానిస్టేబుల్ కె.సదానందం సతీమణి రమాదేవికి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ చేయూత పథకం కింద రూ.లక్షన్నర చెక్కును శుక్రవారం అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబ స్థితిపరిస్థితులను కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరం అందాల్సిన బెనిఫిట్స్ను తక్షణమే అందేలా చూడాలని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్ గౌడ్కు సూచించారు.