సారథి,పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు రైతుబంధు పథకం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమచేయడంతో పెద్దశంకరంపేటలో సీఎం కేసీఆర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిత్రపటాలకు మంగళవారం ప్రజాప్రతినిధులు, పలువురు రైతులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఎకరాలకు గాను 63.25లక్షల మంది రైతులకు రూ.7,058.78 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, రైతుబంధు మండలాధ్యక్షుడు సురేష్ గౌడ్, వైస్ […]
సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]
సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుపై బిజినేపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు మహేష్ […]
సారథి ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం పదిరోజుల పాటు అనగా.. జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్ లో జరిగింది. సమావేశానికి రాష్ట్రమంత్రులు హాజరయ్యారు. లాక్డౌన్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు […]
సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తికానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన రైతులకు రైతుబంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టాలని సీఎం సూచించారు. కల్తీ […]
సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]
సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లిలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ రంజాన్ కానుకను ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం అందజేశారు. బండపల్లిలో స్థానిక సర్పంచ్ న్యాయ విజయ జార్జ్ ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల గంగానర్సయ్య, వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.