Breaking News

CHINNASHANKARAMPET

ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు

సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, […]

Read More
ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు

సారథి, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి, మల్లుపల్లి, రుద్రారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాస్ శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం డీఆర్డీఏ ఐకేపీ ద్వారా 110 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నేటికీ 14,600 మంది రైతుల నుంచి రూ.123 కోట్ల విలువైన 6.64 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 12,600 మంది రైతుల ఖాతాల్లో […]

Read More
హరితహారానికి మొక్కలు రెడీ

హరితహారానికి మొక్కలు సిద్ధం

సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ […]

Read More
ఆత్మీయత పంచిన వేడుక

ఆత్మీయత పంచిన వేడుక

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉన్నత పాఠశాల 2008-09 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం చిన్నశంకరంపేట శ్రీనివాస గార్డెన్​ లో ఉపాధ్యాయులతో కలిసి వారి మధురానుభూతులను పంచుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఒకరికి ఒకరు ఒకే చోట కలవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, జాన్​ వెస్లీ, బాలేశం, నర్సింగరావు, […]

Read More
రుణాలను సకాలంలో చెల్లించాలి

రుణాలను సకాలంలో చెల్లించాలి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్​జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం […]

Read More
మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్​మెంట్​ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్​మోర్చా మెదక్​ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More
15వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

15 వరకు ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్ల గడువు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూళ్ల అడ్మిషన్ల గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉందని, బడి మధ్యలో చదువును ఆపివేసిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్​ స్కూల్​ జిల్లా కోఆర్డినేటర్​ వెంకటస్వామి కోరారు. శనివారం వారు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో యాదగిరి, జడ్పీ హైస్కూలు చిన్నశంకరంపేట కోఆర్డినేటర్ అర్చన, రాములు, ఉపాధ్యాయులు శ్రీకాంత్, రాజ్ కుమార్​, నాగరాజు, సరిత పాల్గొన్నారు.

Read More
విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలి

విద్యార్థులు ఆ మూడు సూత్రాలు పాటించాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: విద్యార్థులు వినయం, విజ్ఞానం, ఆరోగ్యం వంటి మూడు సూత్రాలను పాటించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయలక్ష్మి సూచించారు. శనివారం ఆమె స్థానిక ఎస్టీ హాస్టల్ ను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారం అందజేయడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More