సారథిన్యూస్, రామడుగు: ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్స్నాచింగ్ పాల్పడుడుతున్న ఇద్దరు దొంగలను రామడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చొప్పదండి సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన వేముల రమేశ్(23), వేముల నర్సింహులు(19) జల్సాలకు అలవాటుపడి చైన్స్నాచింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఎస్సై అనూష రామడుగు చౌరస్తాలో తనిఖీలు చేస్తుండగా వీరిద్దరు అనుమానస్పదంగా […]