సారథి, వాజేడు: ఆదివారం ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం పంచాయితీలో కరోనా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మొదటిగా గ్రామ సర్పంచ్ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ దేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బీరబోయిన పార్వతి వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రజలెవరూ టీకాపై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని సర్పంచ్ మేనక సూచించారు.
నిన్న ఒకరు.. తాజాగా ఇద్దరు మృతి మరికొంత మందికి పాజిటివ్ గా నిర్ధారణ సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. కేసులు పెరుగుతుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఓ వ్యక్తి(48) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈనెల21న పెద్దశంకరంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా, అతనికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ […]
సారథి, ములుగు: కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. శుక్రవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలుపల శానిటైజర్ హ్యాండ్ వాష్ ను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలకు కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించారు. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలని చూచించారు. ఆఫీసులో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, ఆఫీసు […]
సారథి, పెద్దశంకరంపేట: రోజురోజుకూ కొవిడ్-19 విస్తరిస్తున్న దృష్ట్యా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో అన్ని వర్తక, వాణిజ్య, ఇతర వ్యాపార సంస్థలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి ఉంచాలని, అనంతరం మూసివేయాలని పెద్దశంకరంపేట సర్పంచ్ ఆలుగుల సత్యనారాయణ కోరారు. శుక్రవారం పేట పట్టణంలో పురవీధుల గుండా తిరుగుతూ మైక్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈవో విఠల్, పంచాయతీ సిబ్బంది […]
సారథి, మానవపాడు: ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మానవపాడు పీహెచ్సీ డాక్టర్శశికిరణ్కోరారు. శనివారం స్థానిక మానవపాడు పీహెచ్సీని గద్వాల డీఐవో డాక్టర్ శశికళ సందర్శించి వార్డుల రూములను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? లేదా? ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారా? లేదా? అన్న అంశాలను ఆరాతీశారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోన టీకాను వేయించుకోవాలని […]
సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటకు చెందిన స్థానిక ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ ఫణికుమార్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాస్కులు శానిటైజర్ ను ఎస్సై నరేందర్ కు అందజేశారు. రెండో విడత కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు నిర్వీరామంగా అందిస్తున్న సేవలు, వారి భద్రత దృశ్య పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేసినట్లు డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణ రెండో విడత విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతోందని హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మతపెద్దల సమావేశంలో మాట్లాడారు. పల్లె నుంచి పట్నం వరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించి పండుగలను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవడమే కాకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. రామనవమి, రంజాన్, మహావీర్ హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు, తమ ఇళ్లల్లోనే జరుపుకోవాలని […]
సారథి, ములుగు: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్నిబంధన ఉత్తర్వులను వివరించారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ శానిటైజర్ ఉపయోగించాలని కలెక్టర్సూచించారు.