న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అక్టోబర్లో టీకా వచ్చే అవకాశం ఉన్నదని బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల చింపాంజీలపై చేసిన ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవ ప్రయోగాలను వేగంగా నిర్వహిస్తున్నట్టు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జెనెన్ర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్లోని కొంతమంది కార్యకర్తలపై […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గురువారం తాజాగా 920 కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో 11వేల పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 230కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 6,446 యాక్టివ్కేసులు […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.
సారథిన్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్లను […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, […]
జైపూర్: ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా కరోనా కోసం తయారు చేసిన మందుపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మెడిసిన్ను మహారాష్ట్రలో అమ్మనివ్వబోమని మంత్రి ప్రకటించారు. కాగా ఇప్పుడు రాజస్థాన్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం ఆ డ్రగ్ను రాష్ట్రానికి పంపలేదని, దాన్ని అమ్మేందుకు పర్మిషన్ కూడా ఇవ్వలేదని రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘువర్మ చెప్పారు. ‘స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనుషులపై డ్రగ్ ట్రయల్ చేసేందుకు పర్మిషన్ […]
ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్కు ఇప్పటివరకు కచ్చితమైన మందు లేదు. కేవలం భౌతికదూరం పాటించటం, శానిజైటర్ల వాడకం, మాస్కులు ధరించడం వంటివి పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్లు, మాస్క్లు, శానిటైజర్లు తయారు చేస్తున్నది. ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్టీ ని తయారు చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ఈ హెర్బల్ టీని స్థానికంగా […]