సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2024-2025 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి.. 2024 జనవరి 6వ వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. తేదీ: 11.2.2024న మధ్యాహ్నం 1గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో పాసైన వారికి […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు. వెబ్సైట్ లోకి […]
సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం […]