సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]
ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్లోనే.. సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు […]
సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో […]