సారథి న్యూస్, కర్నూలు: సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.బుధవారం డోన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రిగా అనర్హుడని విమర్శించారు. శక్తికి మించి అప్పులు చేయడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం జగన్ మోహన్రెడ్డి 15నెలల పరిపాలన కాలంలోనే రూ.1.25లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. […]