ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు డ్రాప్ అవుట్స్ తగ్గించడం.. పౌష్టికాహారం అందించడమే లక్ష్యం జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నారని వివరించారు. […]
సారథి న్యూస్, చేవెళ్ల: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఎంతో శ్రమటోడ్చి పనిచేస్తున్న పంచాయతీ కార్మికులతో పాటుచేవెళ్ల పోలీసు సిబ్బందికి పెంజర్ల అనంతరెడ్డి మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని సోమవారం చేవెళ్ల సీఐ బాలకృష్ణ ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, దామోదర్రెడ్డి, నత్తి కృష్ణారెడ్డి, ఆగిరెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, కుంచం నవీన్, శ్రీకాంత్ రెడ్డి, కనక మామిడి రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.