సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామ శివారులో పేకాట శిబిరంపై నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో బుధవారం తాడూరు ఎస్సై నరేందర్, నాగర్ కర్నూల్ ఎస్సై మాధవరెడ్డి దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది అరెస్ట్ కాగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.67,800 నగదుతో పాటు పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.