Breaking News

న్యాయవిచారణ

నకిలీ మద్యం తాగి 21 మంది మృతి

నకిలీ మద్యానికి 21 మంది బలి

చండీఘర్​: పంజాబ్​ రాష్ట్రంలో నకిలీ మద్యం సేవించి దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్​ న్యాయవిచారణకు ఆదేశించారు. అమృత్​సర్​, బాటాలా, టరన్​టరన్​ ప్రాంతాలకు చెందిన వారు నకిలీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాను. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ సీఎం అమరీందర్​సింగ్​ ట్వీట్​ చేశారు.

Read More